24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎన్ హెచ్ 44 హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

  • అక్కడికక్కడే నలుగురు మృతి

 

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని జంగంపల్లి ఎన్ హెచ్ 44 హైవేపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఎలక్ట్రికల్ స్కూటీని రాంగ్ రూట్లో వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో  ఒక బాలుడు, యువతి ,వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందగా ఆరు నెలల మరో బాబు పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు అతడిని జిఎంఆర్ అంబులెన్స్ లో కామారెడ్డి ఏరియా దావఖానకి తరలించారు చికిత్స అందిస్తున్న సమయంలో బాబు కూడా చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ప్రమాదం కారణంగా రోడ్డు ఇరువైపుల పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

More articles

Latest article