ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్, కోరుట్ల పేట ప్రధాన రహదారి మధ్యలో సర్వాయి పల్లె పెట్రోల్ బంక్ సమీపంలో కారు బైకు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన కారు ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన ఫాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి కి చెందిన ఇన్నోవా కారుగా గుర్తింపు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న శ్రీను, నర్సయ్య ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
