29 C
Hyderabad
Monday, August 3, 2026

డిఆర్డీఓ లో దేశ భక్తి ‘జ్వాల’ను రగిలించిన ఇందూరు హిందీ కవి విరాట్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నవీపేట్ : హైదరాబాద్ లోని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఆడిటోరియంలో మంగళవారం రాత్రి డిఆర్డీఓ డైరెక్టర్ ప్రమోద్ శర్మ అధ్యక్షతన నిర్వహించిన హింది మహోత్సవ్, కవి సమ్మేళనం లో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న నిజామాబాద్ హిందీ కవి శ్రీమన్నారాయణ చారి విరాట్ తన కవిత్వంతో హిందీ భాషాభిమానులను, వందలాది ఆహూతులకు అలరించారు. దేశ భక్తులలో తన జాతీయవాదా కవితలతో దేశభక్తి జ్వాల ను రగిలించారు. ఈ సందర్భంగా వాచిక పరంపర ను దేశవ్యాప్తంగా తీసుకెళుతున్న కవి శ్రీమన్నారాయణ చారి ని వక్తలు అభినందించారు. ఈ కార్యక్రమంలో డా. అర్చన, ప్రముఖ హిందీ కవులు పురుషోత్తం, కైలాష్ భట్టాడ్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article