- కాంప్లెన్ట్ ఇచ్చిన పట్టించుకొని కరెంట్ అధికారులు
- స్తంభం విరిగి పడితే అధికారులదే బాధ్యత అంటున్న గ్రామస్థులు
వేల్పూర్, బతుకమ్మ : గ్రామానికి కరెంట్ వచ్చినప్పుడు బిగించిన కంభ అది. పర్రెలు ఇడి విరిగి కిందపడే పరిస్థితి ఏర్పడిందని కరెంట్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వేల్పూర్ మండలంలోని రామన్నపేట్ గ్రామ పంచాయతీ భవనానికి సమీపంలో ఉన్న వి పీ ఆర్ 12 కరెంట్ పోల్ పరిస్థితి ఇది.ఇది వరకు పల్లె ప్రగతిలో పోళ్లు అన్ని చెక్ చేసిన కూడా ఈ పలుగులు వచ్చి ప్రమాదకరం గా మారిన పోల్ ను గుర్తించకపోవడం గమనార్హం కాగా 55 యేండ్ల కింద బిగించిన ఈ పోల్ ఎప్పుడైనా విరిగి పడిపోయే ప్రమాదం ఉన్నందున వెంటనే అధికారులు ఈ కరెంట్ పోల్ ను మార్చాలని కోరుతున్నారు.

