మెదక్, బతుకమ్మ : మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని కొడపాక, సీతానగర్ గ్రామాల్లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం దుర్గామాత నిమజ్జనం శోభాయాత్రలో మెదక్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మండల నాయకులతో కలసి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళతో కలసి కోలాటం ఆడి సందడి చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. దుర్గామాత శోభయాత్ర పాల్గొనడం సంతోషంగా ఉంది అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ బాలా గౌడ్, మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు జగన్, మాజీ సర్పంచ్ లు సంగప్ప,సంజీవ రెడ్డి,బద్రి మల్లేశం వెంకట్ రాములు, నాయకులు కాశినాథ్ రావు,బెజగం శంకర్ గుప్తా, శ్రీనివాస్ గౌడ్, భూషణం, చారి , భాషప్ప,కృష్ణ, సాయి వర్ధన్ గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
దుర్గామాత శోభాయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి
