బతుకమ్మ, బోధన్: బోధన్ మండల్ పెగడపల్లి గ్రామంలో శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఈ రోజు ఏడవ రోజు శ్రీ మహా చండీ దేవి అలంకరణ, యజ్ఞహోమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత కమిటీ నిర్వాహకులు సతీష్, లింగారెడ్డి, ఆకాష్, పెద్దరాజు, రోహిత్ రెడ్డి, గోపి, యోగేష్, రంజిత్ రెడ్డి, సాయిబాబా, గంగాధర్, మోహన్, సాయిలు, దేవ్రాజ్, లక్ష్మణ్, భాస్కర్, సాయికిరణ్, రవి, సన్నీత్ రెడ్డి, వెంకటేష్, శ్రీను, భూమన్న, నరేష్, సాయిలు, మల్లేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై దేవి దర్శించుకొని ఆశీర్వాదం పొందారు.

