రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో మైనార్టీ షాదీఖానా డైనింగ్ హాల్ కు రూ.10 లక్షలు, సిసి డ్రైనేజీ నిర్మాణాలకు రూ.10 లక్షలు ఎంజిఎన్ఆర్ జి ఎస్ నిధుల నుండి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నిధులు మంజూరు చేశారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి గ్రామ మాజీ సర్పంచ్ షేక్ ఖాదర్, నాయకులు, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
