29 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

వేల్పూర్, బతుకమ్మ : వేల్పూర్ మండల కేంద్రంలోని బిసి కాలనీలో కరెంటు సమస్యను ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఎమ్మెల్యే ను కలిసిన మాజీ ఉప సర్పంచ్ పిట్ల సత్యం , మాజీ ఎంపిటిసి సుంకరి రాము, మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కమలేష్ , సొసైటీ డైరెక్టర్ భోజన యాదవ్ లు కరెంట్ సమస్యపై ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ట్రాన్స్కో అధికారుల తో ఫోన్లో మాట్లాడి, కరెంట్ సమస్యను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో ఏడికి ఎమ్మెల్యే ఆదేశించారు.

More articles

Latest article