25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

హనీట్రాప్‌లో యోగా గురువు రంగారెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

  • పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు

 

హైదరాబాద్, బతుకమ్మ : యోగా గురువు రంగారెడ్డిని హనీట్రాప్ చేసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసిన ఐదుగురిని గోల్కండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. అనారోగ్య సమస్యల పేరుతో ఇద్దరు మహిళలు రంగారెడ్డి యోగాశ్రమంలో చేరారు. రంగారెడ్డితో మహిళలు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలతో అమర్‌ గ్యాంగ్ బ్లాక్‌ మెయిల్ చేశారు. వీరికి యోగా గురువు రంగారెడ్డి రూ.50 లక్షల చెక్కులు ఇచ్చారు. మరో రూ.2 కోట్లు ఇవ్వాలని అమర్ గ్యాంగ్ డిమాండ్ చేశారు. దీంతో రంగారెడ్డి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More articles

Latest article