వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణలో ఇటీవల వరదలకు భారీ నష్టం వాటిల్లింది. వరద నష్టంపై స్పందించిన నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50లక్షలు విరాళం ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన చెక్కును బాలకృష్ణ తరపున ఆయన కూతురు తేజస్విని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అందజేసింది.
