27.7 C
Hyderabad

ఎన్ కౌంటర్ లో 10మంది మావోయిస్టులు మృతి

Must read

📰 Generate e-Paper Clip

ఛత్తీస్ ఘఢ్, బతుకమ్మ : ఛత్తీస్ ఘఢ్ గరియాబంద్ వద్ద గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో పది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోందం బాలకృష్ణ సైతం ఉన్నట్లు సమాచారం. రాయ్పూర్ రేంజ్ ఐజీ అమ్రేష్ మిశ్రా ఎన్కౌంటర్ను ధ్రువీకరించారు. భద్రతా దళాలు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు జరిగాయని.. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

More articles

Latest article