వెబ్ న్యూస్, బతుకమ్మ : తప్పుడు ప్రచారానికి ఐశ్వర్య రాయ్ ఫొటోలు వాడొద్దని డిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. తన అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలను చట్టవిరుద్ధంగా వాడుతున్నారని నటి ఐశ్వర్యరాయ్ ఇటీవల డిల్లీ హైకోర్టు ను ఆశ్రయించారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనపేరు చిత్రాలను ఏఐ ఆధారిత అశ్లీల కంటెంట్ లో అనధికారికంగా వాడుతున్నారని, వీటిని నిరోధించి తన వ్యక్తిగత గోప్యతా హక్కును పరిరక్షించాలని ఆమె కోర్టును కోరారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఐశ్వర్యరాయ్ ఫొటోలు వాడొద్దని తీర్పు ఇచ్చింది.
