27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

లాయర్ పై దాడిని ఖండిస్తూ నిరసన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : కూకట్పల్లి కోర్టు పరిధిలోని  కోర్టు కేసు పనిమీద వెళ్ళిన న్యాయవాది తన్నీరు శ్రీకాంత్ మీద ప్రతిపక్ష పార్టీ వ్యక్తులు కట్టెలతో అన్యాయంగా,  దౌర్జన్యంగా దాడి చేసినందుకు దాడిని బిచ్కుంద న్యాయవాదులు తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో ఇట్టి దాడులు పునరావృతం కాకుండా దాడి చేసిన  వ్యక్తుల మీద, అలాగే వారిని సహకరించిన వ్యక్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ.ప్రకాష్, జనరల్ సెక్రటరీ ఈ. శివాజీ, ఉప అద్యక్షులు రాజేష్ డెస్ముక్, న్యాయవాదులు యం.లక్ష్మణ్ రావు, టీ. విఠల్, జి. మల్లేశ్వర్, ఏ. విఠల్ రావు, షేఖ్ మొహమ్మద్, పి.రవి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article