- బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి
భీమ్ గల్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో చేస్తున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న పథకాలను చూసి ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చెరెందుకు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారని కానిస్టెన్సీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని చెంగల్ గ్రామ గౌడ సంఘ సభ్యులు ఆయన సమక్షంలో పార్టీలోకి రాగ వారికి పార్టీ కండ్వా కప్పి ఆహ్వానించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ ప్రతిష్టతకు కృషి చేయాలన్నారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో గౌడ సంఘ సభ్యులు ఆనంద్ గౌడ్, బాబా గౌడ్, పవన్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, పెద్ద నాగన్న, కస్ప లింబన్న, ఎర్రన్న, పులి నరేందర్, బాకార మహేందర్, పురాస్తపు పెద్ద గంగాధర్, ప్రశాంత్ రెడ్డి, దశ గౌడ్, గంట గంగారం, గంగమల్లు మరో 25 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

