28.8 C
Hyderabad
Monday, August 3, 2026

పార్టీ కోర్ కమిటీ సభ్యులతో సీఎం రేవంత్ భేటీ

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ సీఎం రేవంత్ నివాసంలో శనివారం పార్టీ కోర్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులున్నారు. గాంధీభవన్ లో జరిగే పీఏసీ, అడ్వైజరీ కమిటీ లో చర్చించాల్సిన అంశాలపై సమాలోచనలు జరుపుతున్నారు.  పీఏసీ, అడ్వైజరీ కమిటీ లో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు, యూరియా కొరత, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

More articles

Latest article