వేల్పూర్, బతుకమ్మ : వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన గౌడ సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకొన్నట్లు సంఘ ప్రతినిధులు పల్లె మల్లా గౌడ్, నాయిని దేవేందర్ గౌడ్లు తెలిపారు. సంఘ సర్వ సభ్య సమావేశంలో సంఘ అధ్యక్షులుగా లగ్గాల నర్సాగౌడ్, ఉపాధ్యక్షులుగా డాక్టర్. అబ్బగోని ప్రతాప్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పడాల రాజేశ్వర్ గౌడ్, కోశాధికారిగా బొంబాయి నర్సాగౌడ్, రైటర్ గా నాయిని ఆదిత్య గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.