కామారెడ్డి, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని రైల్వే ప్లాట్ ఫామ్ వద్ద నెల రోజులుగా వర్షానికి తడుస్తూ వికలాంగ వృద్ధురాలు శకుంతల నరకయాతన అనుభవిస్తోంది. కొడుకు వదిలేయడంతో వృద్ధురాలు అందరూ ఉన్న అనాథగా మిగిలింది. స్పందించిన పట్టణ సీఐ నరహరి పోలీస్ సిబ్బంది తో కలిసి వృద్ధురాలిని ఆటోలో వృద్ధ ఆశ్రమానికి తరలించారు.
