బతుకమ్మ, భిక్కనూరు : భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ శనివారం ఆకస్మతిక తనిఖీ చేశారు. ల్యాబ్ ఫార్మసీ రిజిస్టర్లు పరిసరాలు పరిశీలించి తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోగులకు సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని సిబ్బంది ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ డాక్టర్ హేమీమా, సిబ్బంది సతీష్ ఉన్నారు.

