బతుకమ్మ, పిట్లం :
తెలంగాణ విమోచన దినముగా సెప్టెంబర్ 17న రాష్ట్రంలో ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మంగళవారం తెలంగాణ లో భూమికోసం, భుక్తి కోసం ప్రాణ త్యాగాలు చేసిన వీరులకు జోహార్ అని తాహసిల్దార్ వేణుగోపాల్ గౌడ్ కొనియాడారు. మంగళవారం పిట్లం తాహసిల్ కార్యాలయంలో తాసిల్దార్ జెండా ఎగరవేసి జోహార్లు తెలిపారు. వీటితోపాటు పిట్లం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రాజు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కమలాకర్, మండల వ్యాప్తంగా గ్రామపంచాయతీలలో కార్యదర్శిలు జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ అమరులకు నివాళులర్పించారు.
