ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తాహాసిల్దార్ వెంకటరావు 79వ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా నిజామాబాద్ లో ఉత్తమ అవార్డు గ్రహీతగా నిజామాబాద్ లో జిల్లా ఇన్చార్జ్ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగిందన్నారు.కాసిల్ ఆఫీసులో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పైన దృష్టి సారించి వెనువెంటనే సమస్యలు పరిష్కారంలో చూపించడంలో సఫలమయ్యారు. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులు కంప్యూటర్ లో నమోదు చేయడం,రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సర్టిఫికెట్లను సకాలంలో అందించే విధంగా చర్యలు తీసుకోవడంతో ఉత్తమ అవార్డు గ్రహీతగా ఎంపిక కావడం జరిగింది.దీంతో తాహాసిల్దార్ వెంకటరావును సహచర సిబ్బంది తదితరులు అభినందించారు.
