హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ-మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడనున్న అల్పపీడనం శుక్రవారం నాటికి మరింత బలపడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. బుధవారం యాదాద్రి భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు.. గురువారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ ఎలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఒక్కో చోట అతి నుంచి అత్యంత భారీ వర్షాలు.. కుంభవృష్టి కురిసే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 20 సెంటీ మీటర్లకుపైగా వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. అంతేకాకుండా రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
