బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న తరగతి గదుల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని టీజీవీబీ మండల అధ్యక్షులు భరత్ రాజ్ సోమవారం ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజా గంగారెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సరైన తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని త్వరగా పనులు పూర్తిచేసి సమస్య పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రెసిడెంట్ విజయ్, అభి తదితరులు ఉన్నారు.