ఒడిశా లో ఘటన
వెబ్ న్యూస్,బతుకమ్మ : ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నిర్వహించే గ్రీవెన్స్ సెల్ ప్రాంగణంలో సోమవారం పాము కలకలం రేపింది. దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన హాల్లోకి పాము దూరింది. మరి కొద్ది నిమిషాల్లో సీఎం అక్కడికి వస్తుండగా ఈఘటన చోటు చేసుకుంది. స్నేక్ హెల్ప్ లైన్ సిబ్బంది పామును పట్టుకొని సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. దీంతో అధికారులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
