27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

10 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: అక్కపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు తెలిపిన ఎల్లారెడ్డిపేట ఎస్సై కే.రాహుల్ రెడ్డి.. ఈ సందర్భంగా ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన నర్రావుల కొమురయ్య తను నివాసం ఉంటున్న గుడిసెలో  అక్రమ రేషన్ బియ్యం కలిగి ఉన్నాడనే సమాచారం మేరకు అతని గుడిసెలో వెళ్లి తనిఖీ చేయగా అందాద 10 క్వింటాల్లా ప్రభుత్వ రేషన్ బియ్యంను పట్టుకొని సీజ్ చేసి కొమురయ్య ను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ తెలిపారు. బియ్యం విలువ దాదాపు పది వేలు రూపాయలు ఉంటుందని ఎస్సై  తెలిపారు.

More articles

Latest article