హైదరాబాద్, బతుకమ్మ : సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో డాక్టర్ నమ్రత దారుణాలు కొనసాగించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతను ఐదు రోజులు కస్టడీకి అనుమతిస్తూ సికింద్రాబాద్ సివిల్ కోర్టు పదవ అదనపు చీఫ్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏ2 జయ కృష్ణ, ఏ6 ల పోలీస్ కస్టడీపై వాదనలు కొనసాగుతున్నాయి.
