26.2 C
Hyderabad
Monday, August 3, 2026

మూడు నెలల్లో ప్రభుత్వం స్పందించకపోతే నిరాహార దీక్ష చేస్తాం

Must read

📰 Generate e-Paper Clip

  • మంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ ప్రకటించిన అర్బన్ ఎమ్మెల్యే

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మూడు నెలల్లో ప్రభుత్వం చొరవ తీసుకొని 3500 ఇందిరమ్మ ఇండ్ల భర్తీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మరమ్మత్తులు చేసిలబ్దిదారులకు పంపిణి చేయకపోతే ప్రజల తరుపున ఉద్యమం చేపడతాం అన్నారు అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే నిరాహార దీక్షకు పునుకుంటాం అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ డెడ్ లైన్ ప్రకటించారు. మొదటిసారి జిల్లా అధికార యంత్రాంగంతో  నిర్వహించిన  సమీక్షా సమావేశానికి విచ్చేసిన ఇంచార్జ్ మంత్రి దనసరి సీతక్క కు ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ శాలువాతో సత్కరించి పూల బుకేతో స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే మాట్లాడుతు అర్బన్ నియోజకవర్గంలో గత 11 ఏళ్ల నుండి ఒక్క ఇళ్ళు కూడా గరిబోనికి లబ్దిచేకురాలేదని అన్నారు. మొదటి విడతలోనే అర్బన్ నియోజకవర్గనికి 3500 ఇండ్లు పూర్తి చేయాలనీ, జాగా లేని పేదలకు ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు శిథిలావస్థకు చేరుకొని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయన్నారు గత సంవత్సరం హౌసింగ్ మినిస్టర్ ఇదే కలెక్టరేట్లో సమీక్షా నిర్వహించి దసరాకే ఇండ్లు మంజూరు చేస్తామని ఇప్పటికి అతి, గతి లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో  రోగులకు మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం అవుతుందన్నారు రోజుకి 2 వేల మంది వస్తున్నా ఆసుపత్రిలో లిఫ్టులు పనిచేయడం లేదని, స్కానింగ్ యంత్రాలు సరిగా పనిచేయడం లేదని, వైద్యుల కొరత, వివిధ సమస్యల  వలయంగా మారిన సివిల్ ఆసుపత్రి పై ప్రత్యేక ద్రుష్టి పెట్టాలన్నారు. మదర్,  చైల్డ్ విభాగం ప్రారంభనికి నోచుకున్న వైద్యనికి నోచుకోవడం లేదన్నారు, వెంటనే సేవలందించే విదంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో ఉన్న బస్తి దావఖనలో సకల సౌకర్యాలు ఉన్నప్పటికీ డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని అన్నారు జిల్లా వైద్య అధికారి ప్రత్యేక ద్రుష్టి పెట్టలని సూచించారు. అర్బన్ నియోజకవర్గనికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయాలనీ విజ్ఞప్తి చేసారు. అర్బన్ నియోజకవర్గనికి ప్రత్యేక నిధులు 100 కోట్లు మంజూరు చేయాలన్నారు. అమ్మ ఆదర్శపాఠశాల పథకం కింద ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని అన్నారు. అర్బన్ నియోజకవర్గం పలు సమస్యల పైన ఇంచార్జ్ మంత్రికి వినతిపత్రం అందజేశారు.

We will go on a hunger strike if the government does not respond within three months.

More articles

Latest article