బతుకమ్మ ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలో గల జెడ్ పి హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం హిందీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల గెజిటెడ్ హెడ్మాస్టర్ పెద్ది సంతోష్ కుమార్ మాట్లాడుతూ 1949లో రాజ్యాంగ సవరణ ద్వారా హిందీ దినోత్సవ జరపాలని కేంద్రం నిర్ణయించిందని అందువలన హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో హిందూ ఉపాధ్యాయుడు జగదీశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
