26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రికార్డులు తనిఖీ చేసిన డిసిఓ రామ్మోహన్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో గురువారం సొసైటీ కార్యాలయంలోని రికార్డులను జిల్లా సహకార అధికారి రామ్మోహన్ తనిఖీ చేశారు. గోదాములోని ఎరువుల వివరాలు సీఈఓ రమేష్ ను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఎరువులు, యూరియా, విత్తనాలు ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో మానిటరింగ్ అధికారి సురేష్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి లికిత్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.

More articles

Latest article