బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని తిమ్మ నగర్ గ్రామానికి చెందిన బొమ్మల నాందేవ్ (23) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నటు ఎస్సై రాజు తెలిపారు. పోలీసుల కథనం ్రపకారం బొమ్మల నాందేవ్ ఎటువంటి పనిచేయకుండా ఖాళీగా ఉంటుంటే తల్లిదండ్రులు మందలించారు. క్షణికావేశంలో శుక్రవారం తెల్లవారుజామున తిమ్మానగర్ గ్రామ శివారులో గల వాళ్ల పొలానికి దగ్గరలో గల వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు . మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం కు తరలించినట్లు ఎస్సై రాజు తెలిపారు.
