జుక్కల్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శుక్రవారం ప్రజా నేత పీసీసీ డెలిగేట్ విట్టల్ రెడ్డి జన్మదిన వేడుకలు సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం మార్కెట్ కమిటి యార్డులో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సాయిలు, యువజన కాంగ్రెస్ నాయకులు కే.విజయ భాస్కర్ రెడ్డి, ఏఎంసి డైరెక్టర్ సాయిని అశోక్ గంగారాం, నౌష నాయక్, బాలకృష్ణ, హామాండ్లు, జీవన్, కాళోజీ విఠల్, ముత్యం, జ్ఞానేశ్వర్, రిజ్వాన్, గంగాధర్, శేఖర్ రెడ్డి, యువరాజ్, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.

