మద్నూర్, బతుకమ్మ: మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం భవనం నిర్మించేందుకు స్థలాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పరిశీలించారు. స్థానికం జిల్లా పరిషత్ పాఠశాలలో కేంద్రీయ విద్యాలయం తాత్కాలికంగా ఏర్పాటు కోసం ఇప్పటికే జిల్లా, రాష్ట్ర అధికారులకు నివేదిక పంపినట్లు తహశీల్దార్ వివరించారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు ఉన్నారు.
