- జిల్లా మలేరియా వైద్యాధికారి డా.తుకారాం రాథోడ్
రుద్రూర్, బతుకమ్మ : ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా మలేరియా వైద్యాధికారి డా.తుకారాం రాథోడ్ అన్నారు. మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా మలేరియా వైద్యాధికారి డాక్టర్ తుకారం రాథోడ్ ఆకస్మికంగా తనిఖి నిర్వహించారు. ఆరోగ్య కేంద్రంలోని పలు రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలన్నారు. ఆయన వెంట మెడికల్ ఆఫీసర్ డా. అయోషా సిద్ధిఖ, సూపర్వైజర్ రవి, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
