27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆస్తి కోసమే వదినను మరిది హత్య చేశాడు

Must read

📰 Generate e-Paper Clip

వదినను హత్య చేసిన మరిది రిమాండ్ 
. . . భిక్కనూరు సీఐ సంపత్ కుమార్
బిక్కనూర్ , బతుకమ్మ: 
వ్యవసాయ భూమితో పాటు, ఆస్తిని దక్కించుకోవచ్చన్న ఉద్దేశంతోనే  మరిది పదునైన కత్తితో వదినను హతమార్చాడని బిక్కనూర్ సీఐ సంపత్ కుమార్ అన్నారు. మంగళవారం సాయంత్రం భిక్కనూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో సిఐ మాట్లాడుతూ… గత ఐదు రోజుల క్రితం బాగిర్తి పల్లి గ్రామానికి చెందిన మంద సురేష్ అలియాస్ యాకుబ్, తన వదిన లావణ్య అలియాస్ యేసుమనిని బాసన్లు తోముతుండగా వెనకాల నుంచి వెళ్లి పదునైన కత్తితో పొడిచి చంపాడన్నారు. గత కోంత కాలంగా రాములు అతని సోధరుడు సురేష్ ల మధ్య అస్తి తగదాలు ఉన్నాయన్నారు. తండ్రికి వైద్యం విషయం లో సహకరించకపోవడంతో పాటు ఆస్తి పంపకాల విషయంలో అడ్డురావడంతోనే వదిన లావణ్యను మరిధి సురేష్ హత మార్చడని సిఐ తెలిపారు. ఈ మేరకు మరిది సురేష్ ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఎస్సై సాయి కుమార్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article