30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రజావాణికి 109 ఫిర్యాదులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో  సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 109 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తోపాటు అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్ కు అందజేసి సమస్యలను వివరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రజాభవన్ ప్రజావాణి 11కు వాయిదా

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించేందుకు రాష్ర్ట ప్రభుత్వం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించే ప్రజావాణిని బుధవారానికి(11వ తేదీకి) వాయిదా వేసినట్లు కలెక్టర్  రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మంగళవారం రోజున 16వ కేంద్ర ఆర్థిక సంఘంతో ముఖ్యమైన సమావేశాలు ఉన్నందున ప్రజావాణిని వాయిదా వేసినట్లు తెలిపారు.

More articles

Latest article