బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామంలో ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై కాటిపల్లి వెంకట రమణారెడ్డి సహాకారంతో నేషనల్ హైవే అథారిటీ అధికారులు సోమవారం బస్టాండ్ నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బిజెపి నాయకులు మాట్లాడుతూ బస్టాండ్ సమస్య ఉందని ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్లగానే స్పందించిన ఎమ్మెల్యే నేషనల్ హైవే అధికారులతో మాట్లాడే బస్టాండ్ నిర్మాణానికి కృషి చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు గ్రామ బిజెపి నాయకులు, విద్యార్థులు,కృతజ్ఞతలు తెలిపి బస్టాండ్ నిర్మాణం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
