27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

 విచారణ జరిపి మాకు న్యాయం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్ కు రక్షిత తండ్రి వినతి

బతుకమ్మ, నిజామాబాద్ :  వ్యవసాయ పాలిటెక్నిక్ లో మొదటి సంవత్సరం చదువుతున్నతమ కూతురు రక్షిత మృతిపై సమగ్ర విచారణ జరపాలని రక్షిత తండ్రి విష్ణు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ను కోరారు.  రక్షిత కు న్యాయం చేయాలని పీ డీ ఎస్ యూ, యూ ఎస్ ఎఫ్ ఐ, పీ వై ఎల్, దర్మాసమాజ్ పార్టీ లతో కలిసి రక్షిత తండ్రి విష్ణు జిల్లా కలెక్టర్ కు నిజామాబాద్ నగరంలో కలెక్టరేట్ కార్యాలయంలో  శు్క్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న తన కూతురు రక్షిత మూడు రోజుల క్రితమే హాస్టల్ లో జాయిన్ చేశానని తెలిపారు. శనివారం ఉదయం హాస్టల్ లో చనిపోయిందని, కళాశాల ప్రిన్సిపల్ తాము వచ్చేదాకా అపకుండా బోధన్ ఆసుపత్రికి తరలించారని, హాస్టల్లో సీసీ కెమెరాలు చూపించలేదని తెలిపారు. తమ కూతురు ఆత్మహత్యపలు అనుమానాలకు దారితీసిందని,  విద్యార్థులకు పాఠాలు చెప్పే అనేకమంది మహిళా లెక్చరర్స్ ఉండగా పురుషులనే ఎందుకు వార్డెన్ గా నియమించారని , లోపల ఏం జరిగిందో విషయాలను బయట చెప్పకుండా మొదటి సంవత్సరం విద్యార్థులను అదే రోజు ఇంటికి పంపించడం మరిన్ని అనుమానాలకు దారితీసిందని, కావున విద్యార్థి మృతి పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోని మా కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చే శారు. ఈ కార్యక్రమంలోపీ డీ ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, యూ ఎస్ ఎఫ్ ఐజిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది సూరి, దర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ మహారాజ్,  విద్యార్ధి సంఘల నాయకులు కార్తీక్, ప్రిన్స్,మహేష్, దేవిక, ప్రేమ్, మహేష్  కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Investigate and do justice to us

More articles

Latest article