నిజామాబాద్, బతుకమ్మ : నగరంలో సీపీఐ 33వ డివిజన్ శాఖ మహాసభ అశోక్ నగర్ లో జరిగింది. ఈ మహాసభల సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, సిపిఐ నగర కార్యదర్శి వై.ఓమయ్య మాట్లాడారు. కార్మికులు అనునిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీఐ పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. మురికివాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేయాలని కోరారు. 33 వ డివిజన్లోని అశోక్ నగర్ లో విద్యార్థుల,యువకుల కోరిక మేరకు లైబ్రరీను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మహాసభలలో సీపీఐ జిల్లా నాయకులు కె.రాజన్న, నగర నాయకులు ఆలి ఇమ్రాన్, ఫిరోజ్, మహిళా నాయకురాలు మంజుల, రఘురాం ప్రసంగించారు. ఈ మహాసభలో సీపీఐ 33 వ డివిజన్ కార్యదర్శిగా సక్కి సురేష్ ను ఎన్నుకున్నారు.
