వెబ్ న్యూస్, బతుకమ్మ : రాజ్యసభకు కమల్ హాసన్ పంపించనున్నట్లు ఎంఎన్ఎం (మక్కల్ నీదిమయ్యం) పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమిళనాడులో అధికార డీఎంకే, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ మధ్య గతంలో ఓ రాజకీయ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. మరో వైపు దీనిపై డీఎంకే కూడా ఇదే ప్రకటన విడుదల చేసింది. రెండు పార్టీల నుంచి ఒకే ప్రకటన రావడంపై ప్రాధాన్యత సంతరించుకుంది.
