ముప్కాల్,బతుకమ్మ: చదువులమ్మ చెట్టు కింద పదవ తరగతి వరకు చదువుకొని అక్కడి నుండి ఉన్నత చదువుల కోసం వెళ్లి జీవితాల్లో స్థిరపడి మళ్లీ 25 సంవత్సరాల తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవడానికి మంగళవారం ఆత్మీయ సమ్మేళనంతో కలుసుకున్నారు. ఆపూర్వ కలయిక కు ముప్కుల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆత్మీయ కలయికకు వేదికయి. అందరు కలుసుకొని విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో 2000-21 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
