- పెద్ద మనసు చాటుకున్న కురుమ సాయిబాబా
ఎల్లారెడ్డి, బతుకమ్మ :గత పది రోజులుగా బాన్స్ వాడ బస్టాండ్ పరిసర ప్రాంతంలో బాలుడికి ఆటో ఢీ కొన్న ఘటనలో బాలునికి తీవ్ర గాయం అయింది.అతని తల్లి మానసిక పరిస్థితి బాగాలేక, చేసేదేమి లేక గాయంతో అలాగే అదే ప్రాంతంలో ఉండడాన్ని గమనించిన వెల్లుట్ల గ్రామానికి చెందిన కొయ్యల రాజగౌడ్,విషయాన్నీ ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా కు వివరించగా తక్షణమే ఆసుపత్రికి తరలించి తన సొంత డబ్బులతో వైద్యం అందించారు.ఈ ఘటనపై వెంటనే స్పందించినందుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

