26.6 C
Hyderabad
Monday, August 3, 2026

తండ్రి చేతిలో తనయుడి హతం

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : 

 

మద్యం డబ్బుల కోసం వేదిస్తున్న యువకుడిని తండ్రి రాడ్ తో తలపై కొట్టడంతో అతను చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ సంఘటన కామారెడ్డి మండలం దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో జరిగింది. ఎస్సై గుండెల రాజు తెలిపిన కథనం ప్రకారం లింగాపూర్ గ్రామనికి చెందిన వడ్ల నిఖిల్ గత కొంతకాలం నుండి మద్యానికి బానిసై ఏం పని చేయకుండా డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించినాడని ఈ విషయమై ఆదివారం తండ్రికి, నిఖిల్ కి మధ్య గొడవ జరగగా తండ్రి భాస్కర్ నిఖిల్ ని తలపై కొట్టగా బలమైన గాయమైంది. దీంతో నిఖిల్  ను ఆసుపత్రికి తరలించగా సోమవారం కామారెడ్డి ఏరియా హాస్పిటల్ లో  చికిత్స పొందుతూ చనిపోయాడన్నారు. ఈ విషయమై నిఖిల్ అక్క రాళ్లపల్లి ప్రసన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

More articles

Latest article