28.8 C
Hyderabad
Monday, August 3, 2026

దైవదర్శనంకు వెళ్లిన ఇళ్ళును గుల్లా చేసిన దొంగలు

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ :

 

కుటుంబ సమేతంగా ఇంటికి తాళం వేసి దైవదర్శనంకు వెళ్లిన ఓ ఇంటిని దొంగలు గుల్లా చేశారు. కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్కి నగర్ లో నివసిస్తున్న నీళ్ళ సాయినాథ్ నివసిస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో దైవదర్శనానికి వెళ్ళి సోమవారం ఉదయం ఇంటికి రాగా ఎవరో గుర్తులను వ్యక్తులు ఇంటికి ఉన్న తాళాన్ని పగులగొట్టడాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి తాళాన్ని పగులగొట్టి ఇంట్లో ఉన్న రెండు బంగారు నెక్లెస్ లు, కొంత నగదు దొంగతనం చేసినట్లు గుర్తించారు. అలాగే తన ఇంటి పై పోర్షన్ లో ఉన్న పెంటయ్య ఇంట్లో కూడా దొంగతనం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గుండెల రాజు తెలిపారు.

More articles

Latest article