రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో మంగళవారం రుద్రూర్ పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ కావాలనే ఉదేశ్యంతో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించినట్లు రుద్రూర్ ఎస్సై పి.సాయన్న తెలిపారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గంజాయి, మత్తు పదార్థాలు వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సాయన్న హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ సాయన్న, పోలీసులు పాల్గొన్నారు.
