వెబ్ న్యూస్, బతుకమ్మ : సరిహద్దుల్లో కాల్పుల విరమణ, తదనంతర పరిస్థితిపై సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు భారత్, పాక్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. హాట్ లైన్ లో జరగనున్న ఈచర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO)లు పాల్గొననున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు.
