26.6 C
Hyderabad
Monday, August 3, 2026

భీమ్ గల్ మండల బీజేపీ అధ్యక్షుడిగా ఆరె రవీందర్

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) భీమ్ గల్ మండల అధ్యక్షుడిగా ఆరె రవీందర్ నియమితులయ్యారు. మెండోరా గ్రామానికి చెందిన రవీందర్ గతంలో రెండు పర్యాయాలు ఎంపీటీసీ గా పని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి పార్టీ మండల బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. తనకిచ్చిన అవకాశన్ని వినియోగించుకొని మండలంలో పార్టీని మరింత పటిష్టం చేస్తానని పేర్కొన్నారు. తనకింతటి బాధ్యతలను అప్పగించిన ఎంపీ ధర్మపురి అరవింద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్ చార్జీ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారితోపాటు తన నియామకానికి సహకరించిన మండల పార్టీ సీనియర్ నాయకులు, బూత్ ప్రెసిడెంట్లు, కార్యకర్తలందరికీ ఆయన పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article