మే రెండోవారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం
హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరగనున్నాయి. పెరిగిన చార్జీలు మే రెండోవారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. వీటి ద్వారా వార్షికంగా అదనంగా రూ.150 కోట్ల వరకు రాబట్టుకునేలా సంస్థ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం మెట్రోలో కనిష్ఠం రూ.10, గరిష్ఠం రూ.60 ఉండగా.. గరిష్ఠం రూ.75 వరకు పెరిగే అవకాశం ఉంది.
