కమ్మర్ పల్లి, బతుకమ్మ : మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన దూదేకుల సంఘం సభ్యులు 50 మంది మంగళవారం బాల్కొండ కానిస్టేన్సీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోచేరారు.సీ. ఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు ఆకర్షితులై,కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల విధేయతను ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
