బతుకమ్మ మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలో శుక్రవారం మున్నూరు కాపు సంఘం నూతన భవనం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజీఎండీసీ చైర్మన్ అనిల్ ఈరవత్రి, సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ సభ్యులు, జిల్లా ప్రధాన కార్యదర్శి గిర్మాజీ గోపి, మోర్తాడ్ పట్టణ అధ్యక్షులు పుప్పాల అశోక్, మాజీ ఎంపీపీ లడ్డు గంగాధర్, జక్కం అశోక్, మోతే సుభాష్, నీరజ్, చుక్కాయి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
