29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కల్తీ కల్లు తాగి 30 మందికి అస్వస్థత, ఆరుగురు సీరియస్

Must read

📰 Generate e-Paper Clip

 

వింతగా ప్రవర్తిస్తున్న బాధితులు

కామారెడ్డి  జిల్లా గాంధారి(మం) గౌరారం గ్రామంలో ఘటన

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో మరోసారి కల్తీకల్లు కలకలం రేపింది. గాంధారి(మం) గౌరారం గ్రామంలో కుస్తీ పోటీల సందర్భంగా  మంగళవారం గ్రామస్తులు కల్లు తాగారు. ఇందులో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ లో  చికిత్స పొందుతున్నారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కల్లు దుకాణం పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కల్లు తాగిన బాధితులు వింతగా ప్రవర్తిస్తున్నారు.  వీరిని నిజామాబాద్ లోని డి అడిక్షన్ సెంటర్ కు తరలించారు. కల్లు తాగి అనారోగ్యానికి గురై బాన్సువాడ ప్రభుత్వ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న గౌరారం గ్రామానికి చెందిన ఐదుగురిని ఎల్లారెడ్డి ఆర్డీవో బుధవారం పరామర్శించారు.

More articles

Latest article