29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

రేపు లొద్ది రామన్న గుడికి పీసీసీ చీఫ్

Must read

📰 Generate e-Paper Clip

భీంగల్, బతుకమ్మ : భీంగల్ మండలం లోని లొద్ది రామన్న మందిరంలో శ్రీ రామ నవమి సందర్బంగా రాములవారి కల్యాణ వేడుకల్లో ఆదివారం కుటుంబ సమేతంగా పీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ  బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్వగ్రామం బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలంలోని రహత్నగర్ గ్రామం. రహత్నగర్ గ్రామ సరిహద్దులో ఉన్న లొద్ది రామాలయం అంటే వారికీ కుటుంబానికి ఎంతో నమ్మకం. పురాతన కాలంనాటి రామాలయాన్ని మహేష్ కుమార్ గౌడ్ తండ్రి బొమ్మ గంధర్ గౌడ్ 1969 లో ఆలయాన్ని నిర్మించారు. అప్పటినుండి మహేష్ కుమార్ గౌడ్ కుటుంబం ఆలయానికి సేవలందిస్తూ వస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ చిన్ననాటి వయసు నుండి లొద్ది రాములవారు అంటే వారికీ ఎంతో నమ్మకం.

More articles

Latest article